contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆస్తికోసం తల్లిని చంపిన తనయుడు

  • సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం జంగపల్లి శివారులో వ్యవసాయ పొలం వద్ద కన్నతల్లిని పారతో కడతీర్చిన కసాయి కొడుకు.. వివరాల్లోకి వెళితే స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన తమ్మనవేణి కనకవ్వ కి ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. బుధవారం కనకవ్వ వ్యవసాయ పని నిమిత్తం వెళ్లగా కుమారుడు వినోద్ పారతో వ్యవసాయ బావ వద్ద కనకవ్వ తలపై దాడి చేయగా కనుకవ్వ అక్కడికక్కడే మృతి చెందింది, కనకవ్వ భూమిలో ముగ్గురు అక్కలకు భూమి వాటా ఇస్తదనే నేపంతో కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. దాడి చేసి నిందితుడు వినోద్ అక్కడి నుండి పరారైనట్లు స్థానికులు తెలిపారు, సంఘటన స్థలానికి చేరుకున్న తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి, తిమ్మాపూర్ ఎస్సై ప్రమోద్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :