- పలు కేంద్రాలో రికార్డ్స్ నిర్వహణపై అసంతృప్తి
- రికార్డ్స్ తప్పనిసరిగా నిర్వహించక పొతే చర్యలు తప్పవు :-సీడీపీఓ సంతోషి కుమారి
అల్లూరి జిల్లా, అనంతగిరి,ది రిపోర్టర్ న్యూస్: అనంతగిరి మండలం పరిధిలో గల మారుమూల పంచాయతీలలో గురువారం,శుక్రవారం నాడు పలు అంగన్వాడీ కేంద్రాలను అనంతగిరి ఐసీడిఎస్ సీడీపీఓ సిహెచ్. సంతోషి కుమారి,ఏసీడీపీఓ పి. అచ్యుతమాంబలు ఆకస్మికంగా సందర్శించారు. అందులో భాగంగా పెదకోట, పినకోట పంచాయతీలో గల పినకోట,పెదకోట,రేగులపాలెం, కుడియా అంగన్వాడీ సెంటర్స్ ను అనంతగిరి ఐసీడిఎస్ సీడీపీఓ లు సందర్శించిన తర్వాత రికార్డ్స్ తనిఖీ చేశారు. అనంతరం అంగన్వాడీ ద్వారా ఘర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, ప్రీ స్కూల్ పిల్లలకు అందుతున్న సేవలుపై ఆయా అంగన్వాడీ కార్యకర్తల సమక్షంలో లబ్ధిదారులను అరా తీశారు,దానికి లబ్ధిదారులు సక్రమంగానే అందుతున్నాయని బదులిచ్చారు,అంగన్వాడీలో లబ్ధిదారుల హాజరు,పిల్లలు ఎత్తులు, బరువులు,రోజు వారి లబ్ధిదారులకు పంపిణి చేసిన పౌష్టికహారం వివరాలు నమోదుపై అసంతృప్తి వ్యక్తం చెశారు,ఇకపై ప్రతి అంగన్వాడీ కార్యకర్తలు ఏరోజు కారోజు తప్పనిసరిగా రికార్డ్స్ లో నమోదు చేయాలనీ సూచించారు,ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్స్ సూపర్ వైజర్ భీబీ, పెదకోట సచివాలయం మహిళా పోలీస్ ఇంద్రజ, పినకోట, పెదకోట, రేగులపాలెం, కుడియా అంగన్వాడీ కార్యకర్తలు,ఆయాలు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.