contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చొరవతో టౌన్ సర్వీసులు పునః ప్రారంభం.

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో శనివారం చంద్రగిరి నుంచి రేణిగుంటకు ఆర్టీసీ టౌన్ సర్వీసులను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చొరవతో పునఃప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ చెప్పిన వెంటనే చంద్రగిరి నుంచి రేణిగుంటకు ఆర్టీసీ సర్వీసులను అందించినందుకు ఆర్టీసీ జిఎం కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే, ఆర్టీసీ జిఎం బస్సు కు పూజలు నిర్వహించి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. డ్రైవర్ ను పక్కన పెట్టుకొని బస్సు ను స్టార్ట్ చేసి బస్టాండ్ నుంచి నూరు జంక్షన్ వరకు కొద్దిదూరం యువతలో ఉత్సాహం నింపేందుకు ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే పులివర్తి నాని నడిపారు. ఐదు సంవత్సరాల తర్వాత ఆర్టీసీ టౌన్ బస్ సర్వీసులు ప్రారంభించడంపై స్థానికులు ప్రజలు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బస్టాండ్ సమీపంలో ఉన్న షాపు యజమానులతో, సమీపంలో ఉన్న స్థానికులను ప్రతి ఒక్కరిని పేరుపేరునా ఆప్యాయంగా ఎమ్మెల్యే పలకరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :