contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Chandragiri: టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

  • లక్ష రూపాయలుతో శాశ్వత సభ్యత్వ నమోదుతో పులివర్తి సుధా రెడ్డి
  • వంద రూపాయల సభ్యత్వంతో 5 లక్షల రూపాయలు భీమా

 

తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, పదిపుట్లబైలు పంచాయతీ, కొండకిందపల్లిలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి, టిడిపి మహిళా నేత పులివర్తి సుధా రెడ్డి చేతుల మీదుగా స్థానిక నాయకులతో కలిసి శనివారం ప్రారంభించారు. మొదటిసారిగా పదిపుట్లబైలు పంచాయతీలో ప్రవేశపెట్టిన శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముందుగా లక్ష రూపాయలు కట్టి శాశ్వత సభ్యత్వం పులివర్తి సుధా రెడ్డి నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా టిడిపి మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచనలతో టిడిపి సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేపట్టేలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు,శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వంద రూపాయల సభ్యత్వంతో తెదేపా కార్యకర్తలకు 5 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం సాయం అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన వారికి జనవరి నుండి నూతన పెన్షన్లు మంజూరు చేస్తారని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పులివర్తి సుధా రెడ్డి వెంట మండల పార్టీ నాయకులు మహిళ నాయకురాళ్ళు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :