- జీరో బిల్లు తీసుకుంటున్న గృహిణి అరుణ
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకం లో భాగంగా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకం గన్నేరువరం,మాదాపూర్ లో శనివారం ప్రారంభం అయింది. గ్రామాల్లో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ వారు జీరో బిల్ ను పలు కుటుంబాలకు అందజేశారు. శనివారం బుర్ర అరుణ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా గృహిణి అరుణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని మా ఇంటికి జీరో బిల్లు వచ్చిందని సంతోషంగా ఉందని అన్నారు. అన్నారు. కాంగ్రెస్ నాయకులు గంగాధర ఆంజనేయులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని, ఆరు గ్యారంటీ పథకాలు పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు,మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరెంటు ఆపరేటర్లు, గృహ జ్యోతి స్కీమ్ సబ్ ఇంజనీర్ థామస్, విద్యుత్ అధికారులు వెంకటయ్య,అంజయ్య, రాజు, రవికాంత్,శ్రీనివాస్, నాయకులు కళ్లెం మల్లారెడ్డి, అనంతరెడ్డి,మల్లారెడ్డి, సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు.