contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తహసిల్దార్ కి సిపిఐ నాయకుల వినతి

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం తహసిల్దార్ కి భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో అనేక భూ సమస్యలు పేరుకుపోయాయని రైతులు ఎవరికి చెప్పాలో తెలియక అయోమయనికి గురవుతున్నారని అన్నారు . ధరణిలో పూర్తిస్థాయిలో మార్పులు చేర్పులు తీసుకురావాలని రైతులకు న్యాయం చేయాలని కోరారు . సాదా బాయినమపై కొనుగోలు చేసిన భూములను వెంటనే పరిష్కరించాలని అన్నారు . ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి సహాయ కార్యదర్శి చోక్కల శ్రీశైలం,మండల కోశాధికారి గర్శకుర్తి శ్రీనివాస్,యువజన నాయకులు మొలుగురి ఆంజనేయులు,మండల నాయకులు బోయిని మల్లయ్య,కూన మల్లయ్య, కొమురయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :