contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

CUET-2024: పీజీ ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల

జాతీయస్థాయిలో విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024కు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబరు 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 2024 జనవరి 24 రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

పీజీ ఎంట్రన్స్ మార్చి 11 నుంచి 28 వరకు నిర్వహిస్తారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ఓ ప్రకటనలో వెల్లడించింది.

వివరాలు :

డిసెంబరు 26 నుంచి జనవరి 24 వరకు దరఖాస్తుల స్వీకరణ
జనవరి 27 నుంచి 29 వరకు దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు అవకాశం
మార్చి 7 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడింగ్
మార్చి 11 నుంచి 28 వరకు పరీక్షలు
గతేడాదితో పోల్చితే ఈసారి సీయూఈటీలో మార్పులు
మూడు షిఫ్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష
గతేడాది ఎంట్రన్స్ టెస్టుకు రెండు గంటల సమయం… ఈసారి ఆ సమయం 1.45 గంటలకు కుదింపు
అదే సమయంలో… ప్రశ్నల సంఖ్యను కూడా తగ్గించిన ఎన్టీయే. గతేడాది 100 ప్రశ్నలతో పరీక్ష… ఈసారి 75 ప్రశ్నలతో పరీక్ష
ఈసారి పరీక్ష ఫీజు పెంపు. జనరల్ కేటగిరీ విద్యార్థులకు రూ.1200, ఓబీసీ/ఎన్ సీఎల్/జనరల్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు రూ.1000, దివ్యాంగులకు రూ.800, ఎస్సీ/ఎస్టీ/హిజ్రాలకు రూ.900 పరీక్ష ఫీజుగా నిర్దేశించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :