సంగారెడ్డి : కల్హేర మండలంలో రైతుల సాగునీటి కష్టాలు పాలకులకు, అధికారులకు పట్టడం లేదని రైతులు రోపిస్తున్నారు. నల్లవాగు ప్రాజెక్టు నుంచి నల్లవాగు నీళ్లు వస్తున్నప్పటికీ మండలం మొత్తానికి కూడా సాగుభూములకు సరఫరా అయ్యేటటువంటి నీరు ఈ ఖానాపూర్, బిబిపేట్ శివారులోని కొన్ని ప్రాంతాల్లో కట్టలు వేసి నీటి ప్రవాహం ప్రభావం తగ్గించడం వలన పంటలు ఎండిపోతున్నాయి. కల్హేర్ రైతుల కష్టాలు ఎమ్మెల్యే కి కనిపించడం లేదా అని రైతులు వాపోతున్నారు. వేసిన పంటను కాపాడుకునేందుకు రాత్రి వేళలో పంట నీరు కోసం జాగారం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.