contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గౌడ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం ఘనంగా

గన్నేరువరం మండలకేంద్రంలో కౌండిన్య కమ్యూనిటీ హెల్పర్ సొసైటీ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని గురువారం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. నవరాత్రుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాధుని ప్రత్యేక పూజలు అనంతరం గ్రామ సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా లడ్డు, కలశంలకు గౌడ సంఘము కమిటీ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. రూ 2016 లకు లడ్డును కందాల నర్సయ్య గౌడ్ దక్కించుకోగా, కలశం రూ. 1216 లకు బుర్ర రామచంద్రన్ గౌడ్ దక్కించుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కోలాటం మధ్య ఆనందోత్సవాలు జరుపుకున్నారు, ఈ కార్యక్రమంలో గౌడ వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బుర్ర శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షుడు బుర్ర రాజ్ కోటి గౌడ్,నల్లగొని మహేష్, ప్రధాన కార్యదర్శి కందాల నాగరాజు, కోశాధికారి మెరుగు రాంపండు, సహాయ కార్యదర్శి కందాల నవీన్ గౌడ్,బుర్ర తిరుపతి గౌడ్, సభ్యలు బుర్ర మల్లేశం గౌడ్,బుర్ర శ్రీధర్ గౌడ్,గంట గౌతమ్ గౌడ్,బుర్ర అనిల్, బుర్ర శ్రీనివాస్,బుర్ర రమణ,బుర్ర భూమేష్ గౌడ్, బండారి శ్రీహర్ష, బుర్ర నరేష్,ఓల్గల శ్రీను, రాజు,బుర్ర సాయి రోహన్, బుర్ర శశిధర్, బుర్ర మహీందర్, బుర్ర శ్రీచరణ్, అక్షిత్,శివ చరణ్, రిషితేజ్, శ్రియన్స్, నిహారిక,నిత్యా,హర్షిత,మనీశ్వని, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :