contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

490 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు

  • అల్లూరి జిల్లాలో ఆగని గంజాయి దందా.
  •  490 కేజీల గంజాయి స్వాధీనం”
  • ఇద్దరు అరెస్ట్, ఒక ఆటో రెండు ద్విచక్ర వాహనాలు, రూ.74 వేల నగదు సీజ్!!

అల్లూరి జిల్లా, చింతపల్లి : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని సాడిక గ్రామం లోని టేక్ ప్లాంటేషన్ వద్ద భారీ ఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని చింతపల్లి ఎస్సై అరుణ్ కిరణ్ కు అందిన సమాచారం మేరకు ఆ ప్రాంతంపై దాడి చేసి 490 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారని చింతపల్లి సీఐ తెలిపారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుండి ఈ గంజాయిని అక్రమంగా ఎర్ర బొమ్మలు పంచాయతీ,సాడిక గ్రామంలోని టేకు ప్లాంటేషన్ వద్దకు కిముడు శివ,బేర సతీష్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు తీసుకువచ్చి అక్రమ రవాణా చేయడానికి గంజాయి విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తూ కప్పగుంది గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులను సహకరించడానికి ఒప్పందం కుదుర్చుకొని సరుకును సాడిక గ్రామం వరకు తెచ్చారని ఈ విషయంపై చింతపల్లి ఎస్సై అరుణ్ కిరణ్ కు సమాచారం అందడంతో ఆ ప్రాంతం పై దాడి చేయగా 490 కేజీల గంజాయి ఒక ఆటో ఇద్దరు నిందితులు రూ.74 వేల రూపాయలు సీజ్ చేయడం జరిగిందని సీఐ తెలిపారు, అరెస్టు చేసిన కప్పగుంది గ్రామానికి చెందిన వెంకట్రావు, బేరా సతీష్ కుమార్ లను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించామని ఆయన తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :