contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గీతం 15వ స్నాతకోత్సవం ముఖ్య అతిథిగా రామ్ గోపాల్

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ 15వ పట్టాల ప్రదానోత్సవం (స్నాతకోత్సవం) ఈనెల 20న (శనివారం) శివాజీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించనున్నట్టు గీతం హెదరాబాద్ ప్రో వెస్ట్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ మహత్తరమైన రోజున వివిధ విభాగాలకు చెందిన దాదాపు 1800 మంది విద్యార్థులు పట్టాలను అందుకోనున్నట్టు ఆయన తెలిపారు. ఈ అభ్యర్థులు 2023-24 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, సెన్ట్స్, ఫార్మసీ, హ్యుమానిటీస్, ఆర్కిటెక్చర్ కోర్సులను గీతం హెదరాబాద్ ప్రాంగణంలో విజయవంతంగా పూర్తిచేసి, డిగ్రీలు పొందేందుకు అర్హత సాధించినట్టు ప్రొవీసీ వివరించారు.
గీతం కులపతి డాక్టర్ నీరందర్ సింగ్ చౌహాన్ సర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఎం.శ్రీభరత్ తో పాటు ముఖ్య అతిథిగా బార్సేస్ బ్యాంక్ ఇండియా పూర్వ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) రామ్ గోపాల్ పాల్గొంటారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా, గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్లో అత్యాధునికంగా అభివృద్ధి చేసిన సదుపాయాలను రామ్ గోపాల్ ప్రారంభిస్తారని తెలియజేశారు. గీతం 15వ పట్టభద్రుల దినోత్సవానికి సంబంధించిన మరింత సమాచారం కోసం గీతం వెబ్ సెట్ www.gitam.edu ను సందర్శించాలని ప్రోవీసీ సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :