contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

కరీంనగర్ జిల్లా: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి నిరుద్యోగుల సమస్యల పై చేస్తున్న 24 గంటల ఉపవాస దీక్షను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు బిజెపి మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం లోని మానకొండూరు మండల కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా గడ్డం నాగరాజు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఇవ్వాలని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి దీక్ష చేపడితే ఈ నిరంకుశ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పేరుతో ఉపవాస దీక్షను ఇంద్ర పార్క్ వద్ద భగ్నం చెయ్యడం ఈ రాష్ట్ర ప్రభుత్వ పిరికిపంద చర్య అన్నారు.దీక్ష ను భగ్నం చేసిన కూడ కిషన్ రెడ్డి బీజేపీ స్టేట్ ఆఫీసులో దీక్ష ను కొనసాగించారు అని నిరుద్యోగులకు న్యాయం చేసేంతవరకు భారతీయ జనతా పార్టీ నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తుంది తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం నాగరాజు, మానకొండూర్ మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్,మండల ప్రధాన కార్యదర్శి సున్నాకుల శ్రీనివాస్, ఆంజనేయులు, ఉపాధ్యక్షులు ప్రభాకర్ గౌడ్,రాజిరెడ్డి, కరిగేదా పూదరి, రమణ గౌడ్, ఎస్టి జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీహరి, ఆంజనేయులు, అశ్విన్, అంజి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :