ఉద్యోగుల హాజరుపై కఠినంగా వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కేంద్రం ఆదేశించింది. తరచూ ఆఫీసులకు లేటుగా రావడం, సమయం ముగియకముందే వెళ్లిపోవడాన్ని ఉపేక్షించరాదని పేర్కొంది. చాలామంది బయోమెట్రిక్ హాజరు వేయడం లేదని గుర్తించామంది. ఆలస్యంగా వచ్చిన, ముందుగా వెళ్లిపోతున్న వారి సెలవుల్లో కోత పెట్టాలంది. తగిన కారణాలుంటే నెలలో రెండుసార్లు, రోజుకు గంటకు మించకుండా లేటుగా రావడాన్ని క్షమించొచ్చని తెలిపింది.