contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హుస్నాబాద్ ఎమ్మెల్యేని కలిసిన బిఆర్ఎస్ నాయకులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా: హుస్నాబాద్ నియోజక వర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వొడితల సతీష్ కుమార్ ను మూడో సారి ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితెల సతీష్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ శ్రేణులందరం కస్టపడి పని చేసి విజయదుందుబి మ్రోగిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి,శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో చిగురుమామిడి జెడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ తో పాటు జిల్లా రైతు బంధు సమితి సభ్యులు సాంబారి కొమురయ్య, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామోజు రజిత కృష్ణమ చారీ, కొత్త కైలాసం, పెద్దపల్లి రవీందర్, వంతడుపుల దిలిప్ కుమార్, మారెళ్ల కొమురయ్య, బిల్ల వెంకట్ రెడ్డి, గడ్డం అనిల్ కుమార్, కాశబోయిన నర్సయ్య, మైలారపు చంద్రయ్య, బుస ఐలయ్య తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :