contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర దాడులు

లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ సేనలు మంగళవారం ఉదయం క్షేత్రస్థాయి దాడులు ప్రారంభించాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ప్రకటనలో, తమ దేశ సరిహద్దుకు సమీపంగా ఉన్న దక్షిణ లెబనాన్ గ్రామాల్లో హిజ్బుల్లా మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకొని పరిమిత స్థాయి దాడులు చేపట్టినట్టు స్పష్టం చేసింది.

ఉత్తర ఇజ్రాయెల్‌లో పౌరులకు తక్షణ ముప్పు ఉందని, ఈ నేపథ్యంలో హిజ్బుల్లా పై ‘పరిమితంగా, స్థానికంగా, లక్షిత’ దాడులు చేస్తున్నట్టు ఐడీఎఫ్ పేర్కొంది. కచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. దాడులకు వైమానిక దళం, ఫిరంగిదళాలు మద్దతుగా ఉంటున్నాయి.

లెబనాన్ సరిహద్దు పట్టణం ఐతా అల్-షాబ్‌లో ప్రజలు భారీ బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయని, హెలికాప్టర్లు, డ్రోన్ల కింద ప్రయాణిస్తున్నాయని తెలిపారు. మరో సరిహద్దు పట్టణం ఆర్మీష్‌లో భారీ మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు మరింత విస్తృతమయ్యాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ సోమవారం, లెబనాన్‌లో తదుపరి దశ దాడులు త్వరలో ప్రారంభమవుతాయని ప్రకటించారు., హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని గ్రూప్ డిప్యూటీ లీడర్ నయీమ్ ఖాస్సేమ్ అన్నారు. ఆయన నస్రల్లా మరణం తర్వాత తొలిసారి బహిరంగంగా మాట్లాడారు. ప్రతిఘటన ఉంటుందని, సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

ఈ పరిణామాలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :