contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Karampudi : వైసిపి నుండి టిడిపిలోకి భారీ వలసలు

పల్నాడు జిల్లా, కారంపూడి : మాచర్ల నియోజకవర్గంలో వైసీపీకి భారీ గంఢి పడింది. ఆ పార్టీ నేతల వైఖరి కారణంగా ఇక ఆ పార్టీలో కొనసాగలేమని భావించి ఊర్లకు ఊర్లు తెలుగుదేశం పార్టీ చెంతన చేరుతున్నారు. రెండు రోజుల్లోనే దాదాపు వెయ్యిమందికిపైగా వైసీపీకి బలమైన కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. తాజాగా సోమవారం నాడు కారంపూడి మండలానికి చెందిన ఎస్సి మాల సామజిక వర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా జూలకంటి వారికి తెలుగదేశం కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :