contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కవితను తీహార్ జైలుకు తరలించిన పోలీసులు

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈడీ అధికారులు మంగళవారం ఆమెను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌ను విధించింది. దీంతో ఆమెను మధ్యాహ్నం జైలు వ్యాన్‌లో తీహార్ జైలుకు తరలించారు. ఆమె ఏప్రిల్ 9వ తేదీ వరకు జైల్లో ఉండనున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచవలసి ఉంటుంది.

కవితను ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో పన్నెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన మరుసటి రోజు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి… పది రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరింది. న్యాయస్థానం ఆమెను తొలుత 7 రోజులు… ఆ తర్వాత 3 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ రోజు తిరిగి న్యాయస్థానంలో ప్రవేశపెట్టడంతో ఆమెకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :