- గుండెపోటుతో కాంగ్రెస్ కార్యకర్త మృతి
మానకొండూర్:జూన్10 మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామ శివారులో కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన ఆవునూరి మల్లేశం (57) కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు, డీసీసీ అధ్యక్షుడు కవ్వపల్లి సత్యనారాయణ అతడిని కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ.. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.