contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గోవులను వధించి .. మాంసాన్ని తరలిస్తున్న వారి పై కేసు నమోదు

  • ఆటో సీజ్, ముగ్గురిపై కేసు నమోదు

 

పిఠాపురం : గోవులను వధించి పశు మాంసాన్ని తరలిస్తున్న ఆటోను గొల్లప్రోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు పరిశీలిస్తే… కొంతమంది వ్యక్తులు ఆటోలో పశు మాంసాన్ని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నిఘా పెట్టిన పోలీసులు మండల పరిధి కొత్త వజ్రకూటం గ్రామ సమీపంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఆటో పై దాడి చేశారు. వాహనాన్ని తనిఖీ చేయగా 2 వందల కేజీలకు పైగా పశు మాంసం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గో మాంసాన్ని రవాణా చేస్తున్న చెందుర్తి గ్రామానికి చెందిన కట్టమూరు ప్రసన్నకుమార్ (జగన్), దొండపాటి అప్పారావు, కాకాడ ఉదయ్ కుమార్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఆటోలో ఉన్న మాంసాన్ని ధ్వంసం చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. గడచిన కొంతకాలంగా పిఠాపురం పట్టణానికి చెందిన డాన్ ఆధ్వర్యంలో చందుర్తి పరిసర ప్రాంతాల్లో గోవద జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు గో వధ పై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :