- ఫీల్డ్ అసిస్టెంట్ పై జనసైనికులు వేధింపులు
- ఆత్మహత్యయత్నం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ సునీత
కాకినాడ : పెనుగుదురు ఫీల్డ్ అసిస్టెంట్ పూలపకుర సునీత పై జనసైనికులు వేధింపులు ఎక్కువవ్వడం తో భరించలేక తెల్లవారుజామున నిద్రమాత్రలు, టైల్స్ లోకి వాడే గమ్ ను కలుపుకుని త్రాగడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. ఎన్.ఆర్.జీ.ఎస్ లో ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వరిస్తున్న పూలపకూర సునీతను కరప మండలానికి చెందిన జనసేన నాయకులు బండారు మురళి, నానీబాబు, భవానీలు ఉపాధి హామీలో దొంగ మస్తార్లు వేసి నెలకు రూ.20వేలు ఇవ్వాలని గత మూడు నెలలుగా వేదిస్తున్నారని, బండారు మురళి తనతో సన్నిహిత్యంగా ఉండాలని, కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నం చేసినట్లు, నానీబాబు అను వ్యక్తి కులదుషణ చేస్తూ మనసునొచ్చుకునే విధంగా మాట్లాడుతున్నాడని, తన భార్య ఆత్మహత్యయత్ననికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని భర్త వీరబాబు కోరారు.