contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Manakondur: మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల 35వ వార్షికోత్సవ వేడుకలు

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ గ్రామంలో, స్వతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల మరియు వృత్తి విద్యా శిక్షణా కేంద్రం 35వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, మరియు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మరియు సీపీఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ్రూ శోభారాణి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకిటి కరుణ, డైరెక్టర్ క్రాంతి వేస్లి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల దేశాయ్ పాల్గొన్నారు.

మంత్రులు ప్రత్యేక పాఠశాలను పరిశీలించారు. మానసిక విద్యార్థులకు ఇస్తున్న శిక్షణపై వారు ఆరా తీశారు. వృత్తి శిక్షణ కేంద్రంలో పెపర్ ప్లెట్స్ పరిశ్రమ తయారీని చూసి, విద్యార్థులను అభినందించారు.

అలాగే, మానసిక విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను చూసి మంత్రి మరియు ఇతర అతిథులు ఆనందంగా అలరించారు. ఈ కార్యక్రమం మానసిక వికలాంగుల విద్యార్థులకు కొత్త అవకాశాలు అందించడం కోసం విశేషమైన మద్దతు చేకూరుస్తుంది.

ఈ వేడుక ద్వారా మానసిక వికలాంగుల విద్యార్థుల సమాజంలో స్వీకరింపును ప్రోత్సహించడం, వారు సాధించవలసిన లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడడం గురించి స్పష్టమైన సందేశం సమాజానికి ఇస్తున్నట్లు తెలుస్తుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :