contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కన్నతల్లిని వదిలేసిన కొడుకు .. రిపోర్టర్ టీవీ కథనంతో స్పందించిన అధికారులు

కరీంనగర్ జిల్లా: కన్నతల్లిని వదిలి వెళ్లిన కసాయి కొడుకు సాయిని బాలవ్వ గురించి రెండు రోజుల క్రితం “ది రిపోర్టర్” టీవీలో ప్రసారమైన కథనం పట్ల గన్నేరువరం రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ కథనం ప్రసారమైన తరువాత, ఎమ్మార్వో నరేందర్ బాలవ్వతో మాట్లాడి కొడుకును పిలిపించాడు.

ఈ నేపథ్యంలో, శనివారం, బాలవ్వ కుమారుడు సాయిని చిన్న మల్లేశం మరియు కోడలు మధులతలను ఖాసీంపేట గ్రామానికి పిలిపించి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎమ్మార్వో విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా, చిన్న మల్లేశం పేరు మీద ఉన్న ఐదు ఎకరాల భూమిని బాలవ్వ పేరుమీదకి మార్పిడి చేస్తామని ఎమ్మార్వో తెలిపారు. “ది రిపోర్టర్” టీవీ కథనంపై స్పందించిన రెవెన్యూ అధికారుల చర్యలకు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :