contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

కరీంనగర్ జిల్లా:మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ని మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  పాఠశాలలో సరైన సదుపాయాలు లేక విద్యార్థినిల తల్లిదండ్రులు అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే కి ఫిర్యాదు చేయగా ఈరోజు పాఠశాలను సందర్శించారు. విద్యార్థులందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలువ ఉండి అపరిశుభ్రంగా ఉండడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. అక్కడి నుండే బీసీ వెల్ఫేర్ శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమస్యలు తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మళ్ళీ పది రోజుల తర్వాత పాఠశాల సందర్శిస్తాను సమస్యలు పరిష్కరానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరియు ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులు బాగా చదువుకోవాలంటే సమస్యలు పరిష్కరించాలని అపరిశుభ వాతావరణంలో పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక శాసనసభ్యులగా విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత నాపై ఉంది కనుక వెంటనే పాఠశాల సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :