contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3వ తేదీ ఆదివారం నాడు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా తీసుకునేటువంటి ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ ఆఫ్ సి.ఆర్.పి.సి. అమలు చేస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తేదీ 03-12-2023, ఆదివారం రోజు ఉదయం 6 గంటల నుండి తేది 04-12-2023, సోమవారం నాడు ఉదయం 6 గంటలవరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఐదుగురికి మించి గుమికూడరాదని తెలిపారు. ఏదైనా చట్టపరిధిలోని కారణంచేత, సమావేశ పడవలసిన అవసరం ఏర్పడితే సంబంధిత అధికారి ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. పై ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :