contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర బడ్జెట్

కరీంనగర్ జిల్లా: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి అన్నారు. వీధి వ్యాపారులు మొదలు రైతులు పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వ్యవసాయ రంగానికి రూ. 72 వేల 659 కోట్లు కేటాయించడంతో రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. వ్యవసాయానికి ,సాగునీటికి, తాగునీటికి, వైద్యానికి, విద్యకు, అనే కాకుండా అన్ని రకాల ప్రతి పేదవానికి ఉపయోగపడే విధంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :