contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ జిల్లా: రాబోయో అసెంబ్లి ఎన్నికలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేల సత్పతి తెలిపారు. మంగళవారం చొప్పదండి. కరీంనగర్ రిటర్నింగ్ అధికారులు, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ మెటీరియల్, ర్యాండమైజేషన్ ప్రక్రియ తదితర వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కరీంనగర్,చొప్పదండి నియోజక వర్గాల స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను పరిశీలించారు.పోలింగ్ కౌంటింగ్ లలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను ఆర్వోలు సమీక్షించుకోవాలని, కౌంటింగ్ కొరకు కళాశాలలో ప్రవేశం, బయటకు వెళ్లేదారి, పార్కింగ్ లలో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను చేసుకోవాలని తెలిపారు.ఇంకా ఏమైనా అవసరం ఉన్నట్లయితే వాటిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ ఆర్డీఓ కే. మహేశ్వర్, తహశీల్దార్లు రమేష్, రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :