contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకోకుండా డీజేను బంద్ చేశారని కేటీఆర్ విమర్శలు

హైదరాబాద్ : శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత మహ్మద్ అల్లావుద్దీన్, పలువురు తెలంగాణ నేతలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందన్నారు. రాష్ట్రంలో దసరా పండుగ చేసుకునే వీలులేకుండా భయానక వాతావరణం సృష్టించారని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉంటే రైతుబంధు, బతుకమ్మ చీరలు వచ్చి ఉండేవన్నారు. ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకోకుండా డీజేను బంద్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు రుణమాఫీ పూర్తిగా కాలేదన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కానీ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క మహిళకూ రూ. 2,500 రాలేదన్నారు. మూసీ ప్రక్షాళన పేరిట లక్ష కోట్ల రూపాయలను కాజేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. కమీషన్లు రావు కాబట్టే ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు.

హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని, అక్కడి ఫలితాలు చూశాక అయినా తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. కేసీఆర్ లేని లోటును హైదరాబాద్‌లో ప్రతి ఒక్కరూ గుర్తుకు చేసుకుంటున్నారని తెలిపారు. సీఎం సొంత నియోజకవర్గంలో రైతులు, ప్రజలకు అండగా నిలబడిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని దుర్మార్గంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :