contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గొండుపాలెంలో భూ మాఫియా .. పట్టించుకోని అధికారులు భూ మాఫియా

  • గొండుపాలెంలో పేదల భూమీ హంపట్.
  • రూ.2 కోట్లు విలువ కుమ్మరి ఇనాం భూమి కబ్జా.

 

అనకాపల్లి జిల్లా, కె. కోటపాడు, (ది రిపోర్టర్  ): మండలంలో గొండుపాలెం గ్రామానికి చెందిన పేద కుమ్మరి కుటుంబాలకు వారసత్వంగా వస్తున్న ఇనాం భూమిని కొందరు స్వార్థపరులు తప్పుడు కాగితాలు సృష్టించి కబ్జా చేసి అమ్మకారు జరిపారని కుమ్మరి కుటుంబానికి చెందిన పలువురు వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు. తాతలు ముత్తాతల నుండి అనుభవంలో ఉన్న మా భూమినీ గ్రామంలో ఉన్న కొంతమంది పెద్దలు మా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మా భూమిని వేరే వ్యక్తికి అమ్మి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారని స్థానిక తహశీల్దార్ కు పిర్యాదు చేశామని అన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు కూడా పిర్యాదు చేశామని, వెంటనే కలెక్టర్ స్పందించి న్యాయం చెయ్యాలని ఆవేదన వ్యక్తం చేశారు . సర్వే నంబర్ 236/1, 340/2, 340/3, 340/7 లలో ఉన్న సుమారుగా ఒక ఎకరా 88 సెంట్లు భూమి కబ్జా చేశారని, దీని విలువ 2కోట్లు కు పైనే వుంటుందని సోమవారం విలేఖర్లు కుమ్మరు లు తెలియజేసారు. వెంటనే మా భూమిని అమ్మినవారి పైనా, కొన్నవారి పైనా తగు చర్యలు తీసుకొని మా భూమిని మాకు అప్పగిస్తారనీ అధికారులను , నాయకులను కోరుతున్నామని అన్నారు.కుమ్మరి కులస్తుల ఇనాం భూమిని మాకు తిరిగి అప్పగిస్తారని లేనట్లయితే మేము అంతా పోరాటం చేస్తామని హెచ్చరించారు. మా భూమిని మేము దక్కించుకునేందుకు మా ప్రాణాలైనా పరంగా పెడతామని ఆవేద చెందారు . ఈ సమావేశంలో శ్రీకాకుళం దుర్గమ్మ, సత్యబాబు, అప్పారావు, కొత్తూరు దేముడు ,పెద దేముడమ్మ తదితరులు పాల్గొన్నారు.

Centrino Mens 3211 Sneakers

Centrino Mens 3211 Sneakers

Deal Price : ₹499 – M.R.P.: ₹2,199
https://amzn.to/46oQ4Gh

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :