హైదరాబాద్: బుధవారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడలోగల సందర్శినీ ఎలైట్ రెస్టారెంట్లో జనరల్ మేనేజర్గా చేస్తున్న దేవేందర్ గాయన్పై (35) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దేశవాళీ తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరపడంతో దేవేందర్కు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.
