contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Masaipet Tahsildar : ప్రజా పాలన దినోత్సవం ఘనంగా

  • తహసిల్దార్ విజ్ఞాన జ్యోతి జెండా ఆవిష్కరించారు

 

మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం కేంద్రంలో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా తహసీల్దార్ జ్ఞాన జ్యోతి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 1947 ఆగస్టు 15 న బ్రిటిష్ పాలననుండి దేశప్రజలకు విముక్తి కలిగింది కానీ తెలంగాణ ప్రజలకు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కలగలేదన్నారు. మాజీ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ స్వతంత్ర భారతదేశం లో విలీనమైన రోజును తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించుకోవడం సంతోషకరమని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఉదండపురం నరసింహులు, పెద్దలు, యువజన సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, యువత అసోసియేషన్ సభ్యులు, మండల ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :