మెదక్ జిల్లా / వెల్దుర్తి : నేరాలు అదుపు చేయడం కోసం ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు వెల్దుర్తి ఎస్సై టీ రాజు తెలిపారు. వెల్దుర్తి నుండి నర్సాపూర్, తూప్రాన్, మెదక్ రూట్ లో వెళ్లే ఆటోలకు పోలీసు వారు ఒక సీరియల్ నంబర్ ఇస్తున్నట్లు, ఆటో యజమానుల వివరాలను పోలీస్ రికార్డులలో నమోదు చేస్తున్నామని, నేరాలు నియంత్రించడానికి పోలీసువారికి సహకరించాలని ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఆయన సూచించారు.