contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Medak: సీపీఎం పార్టీ జిల్లా నూతన కమిటి ఎన్నిక

తూప్రాన్ : నవంబర్ 2, 3 తేదీలలో తూప్రాన్ పట్టణంలో జరిగిన సీపీఎం పార్టీ జిల్లా 15వ మహాసభలు జయప్రదంగా ముగిశాయి. ఈ మహాసభల సందర్భంగా నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 15 మందితో రూపొందించిన ఈ కమిటీలో కడారి నర్సమ్మను ఏకగ్రీవంగా నూతన జిల్లా కార్యదర్శిగా ఎన్నిక చేశారు.

ఈ సందర్భంలో కడారి నర్సమ్మ మాట్లాడుతూ, “సీపీఎం పార్టీ జిల్లా కమిటీపై నమ్మకం ఉంచినందుకు ప్రజలకు, పార్టీల సభ్యులకు ధన్యవాదాలు” అని తెలిపారు. నూతన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా ఏ.మల్లేశం, కె.మల్లేశం, బి.బస్వరాజు, ఏ.మహేందర్ రెడ్డి, మరియు బి.బాలమని ఎన్నికయ్యారు. ఇక, కె.నాగరాజు, కె.బాగయ్య, సంతోష్, డి.మల్లేశం, అబ్బాస్, అనుష, ప్రవీన్ కుమార్, అజయ్ కుమార్ తదితరులు జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు.

ఈ మహాసభల సందర్భంగా 18 రకాల తీర్మానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా, జిల్లాలోని రైతాంగ సమస్యలు, విద్యారంగ సమస్యలు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు, మహిళల పై వేధింపులు, మరియు కార్మికుల కనీస వేతనం చెల్లించే అంశాలను ప్రస్తావించారు.

మహాసభలో తీసుకున్న కొన్ని ముఖ్యమైన తీర్మానాలు:

  1. రైతాంగ సమస్యలు పరిష్కరించాలి.
  2. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.
  3. మహిళలపై వేధింపులు ఆపాలి.
  4. కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని కోరాలి.
  5. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి.
  6. ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
  7. గ్రామ పంచాయతీ & మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరాలి.

 

మహాసభలో ప్రతిపాదించిన తీర్మానాల అమలుకు కొత్త జిల్లా కమిటీ పోరాటం నిర్వహిస్తుందని కడారి నర్సమ్మ స్పష్టం చేశారు.

రెండు రోజుల పాటు తూప్రాన్ లో జరిగిన జిల్లా మహాసభలకు సహకరించిన ప్రజానీకానికి, కార్మిక వర్గానికి, శ్రేయోభిలాషులకు, అందరికీ సీపీఎం పార్టీ జిల్లా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :