contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Metpally: పోలీస్ వారి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈపోటీలను జిల్లా డిఎస్పీ ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. మెట్ పల్లి చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన జట్లు పాల్గొననున్నాయి. ఈ మేరకు క్రీడాకారులకు పోలీస్​ సిబ్బంది వాలీబాల్ కిట్లను అందజేశారు.

జీవితంలో ఆటలు అనేవి ఒక భాగంగా పెట్టుకొని తమకు నచ్చిన ఆటనలను ఆడి మంచి ప్రతిభ కనబరిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని డిఎస్పీ పేర్కొన్నారు. యువకులు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉదయం వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమలో సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సైలు చిరంజీవి,రాజు, ట్రైనింగ్ ఎస్సై సతీష్, ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ ,మల్లాపూర్ ఎస్సై కిరణ్ కుమార్,ఆల్ రౌండర్ గంగాధర్, ఎం.ఏ.చారి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :