contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రిటైర్డ్ యం.పి.డి.ఓ హత్యకు పాల్పడిన సుఫారీ గ్యాంగ్ సభ్యుల అరెస్టు

మూడు రోజుల క్రితం బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ యం.పి.డి.ఓ. నల్లా రామకృష్ణయ్య

(వయస్సు70)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన సుఫారీ గ్యాంగు చెందిన ఐదుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురు నిందితులను బచ్చన్నపేట మరియు టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. అరెస్టు చేసిన నిందితుల నుండి పోలీసులు ఒక కారు, మూడు సెల్ఫోన్లు, పదిహేనువేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1.గిరబోయిన అంజయ్య, తండ్రిపేరు ఆగయ్య, వయస్సు 55, గోపాల్ నగర్, బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా, 2. డోలకొండ శ్రీకాంత్, తండ్రిపేరు నర్సయ్య, వయస్సు 22, బచ్చన్నపేట, జనగామ జిల్లా 3.శివరాత్రి బాషా, అలియాస్ భాస్కర్, తండ్రి పేరు శంకరయ్య, వయస్సు 27. బచ్చన్నపేట, జనగామ జిల్లాకు చెందిన వారుకాగా ప్రస్తుతం పరారీలో వున్న నిందితులు బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన దండుగుల తిరుపతి, దండుగుల రాజు వున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వివరాలను వెల్లడిస్తూ నిందితుల్లో ప్రధాన నిందితుడైన గురబోయిన అంజయ్యకు చెందిన భూములకు సంబంధించి కొద్ది రోజులుగా గోడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సర్వే నం 174 భూములకు సంబంధించి మృతుడు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసి మృతుడు నల్లా రామకృష్ణ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు అనే అక్కసుతో మృతుడు రామకృష్ణయ్యను హత్య చేసేందుకు అంజయ్య సిద్ధపడ్డాడు. ఇందుకోసం అంజయ్య, తిరుపతిలకు గతంలో పరిచయం వుందడంతో రామకృష్ణయ్య అంతమొందిస్తే 8 లక్షలు రూపాయలు ఇస్తానని ప్రధాన నిందితుడు అంజయ్య మరో నిందితుడు తిరుపతితో ఒప్పందం చేసుకోవడంతో పాటు, అందుకు అంగీకరించిన తిరుపతి అంజయ్య నుండి 50వేల రూపాయలు అడ్వాస్సు తీసుకోవడం జరిగింది. రామకృష్ణయ్య హత్య చేసేందుకు నిందితుడు. తిరుపతి మరో ముగ్గురు నిందితులు తన దగ్గరి బంధువులైన డోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా, ఆలియాస్ భాస్కర్, దండుగుల రాజు సహాకారాన్ని తీసుకున్నాడు. ఈ హత్యలో భాగంగా ఈ నలుగురు నిందితులు ఈ నెల 15వ తేదిన ఒక కారును తీసుకోని సాయంత్రం 5.30 నిమిషాలకు పోచన్నపేట గ్రామ శివారు ప్రాంతంలో బచ్చన్నపేట నుండి పోచన్నపేటకు వెళ్ళుతున్న మృతుడు రామకృష్ణయ్యను నిందితులు నలుగురు బలవంతంగా కారులోకి ఎక్కించుకోనిపోయి, సుమారు అదేరోజు సాయంత్రం 6.30 నిమిషాలకు చిన్నరామన్చర్ల గ్రామ శివారు ప్రాంతంలో నిందితులు మృతుడు రామకృష్ణయ్య కారు నుండి దింపి టవల్తో మృతుడి మెడను బిగించి ఊపిరి అడకుండా చేసి రామకృష్ణయ్య దారుణం హత్య చేసారు. హత్య అనంతరం నిందితులు రామకృష్ణయ్య మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి ఓబూల్ కేశవాపూర్, పెద్దపహాడ్ మీదుగా చంపక్ హిల్స్ ప్రాంతంలోని క్వారీ నీటిగుంటలో రామకృష్ణయ్య మృతదేహాన్ని పడవేసి నిందితులు అక్కడి నుండి బచ్చన్నపేటకు చేరుకోని రామకృష్ణయ్య హత్య చేసినట్లుగా ప్రధాన నిందితుడు అంజయ్యకు సమాచారం అందించి కారును అంజయ్య ఇంటి ముందు వుంచి నిందితులు. వెళ్ళిపోయారు.
నిందితుడు గతంలో అక్టోబర్ మాసంలో సుభద్ర అనే మహిళ ను సుపారీ గ్యాంగ్ కు రెండున్నర లక్షల రూపాయలు సుపారితో హాత్య చేయించాడు.

పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించడం జరిగింది. ఇందులో ప్రధాన నిందితుడు అంజయ్య. పోలీసులు అరెస్టు చేయగా అంజయ్య ఇచ్చిన సమాచారం మేరకు మిగితా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసారు.

ఈ హత్య కేసును చేధించడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ డిసిపి సీతారాం, జనగామ ఏసిపి దేవేందర్ రెడ్డి, ఫోర్స్ ఏసిపి జితేందర్ రెడ్డి, నర్మెట్ట సర్కిల్ ఇన్స్స్పెక్టర్ నాగబాబు, బచ్చన్నపేట ఎస్.ఐ నవీన్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాంబాబు, ఎస్.ఐ దేవేందర్, శరతో పాటు టాస్క్ఫోర్స్ ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :