contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

శాంతించిన గోదావరి పునప్రారంభమైన అంతరాష్ట్ర రాకపోకలు

రిపోర్టర్ టీవి వాజేడు /ములుగు : భారీ వర్షాలు గోదావరి వరదల కారణంగా గత 20 రోజులుగా రాకపోకలు స్తంభించిపోయిన, ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారి నుండి గోదావరి వరద నీరు తగ్గిపోవడంతో, రాకపోకలు కొనసాగుతున్నాయి, సుమారు రెండు వారాలకు పైగా వాగు గుండా గోదావరి వరద నీరు చొచ్చుకు వచ్చి ,ఎన్హెచ్ 163 రహదారిని ముంచేతివేసింది .ఫలితంగా వరంగల్, ఎటునాగారం వాజేడు మీదుగా ఛత్తీస్గడ్, బీజాపూర్, మహారాష్ట్ర తదితర అంతర్రాష్ట్ర రవాణా రోజుల తరబడి నిలిచిపోయింది.వాగు కు ఇరువైపులా కిలోమీటర్ల పొడవున భారీ కంటైనర్లు, లారీలు, ఇతర వాహనాలు స్తంభించిపోయాయి. వాహనాల డ్రైవర్లు రెండు వారాలకు పైగా రహదారి పైనే ఉండి తిండి దొరక్క, వంట సామాగ్రి దొరక్క, నానా కష్టాలు పడ్డారు. అయితే గురువారం ఉదయం రెండు అడుగులు పైగా లోతు ఉన్న రహదారి పైనుండి వాహనాలకు అనుమతించారు. సాయంత్రాని కల్లా రహదారిపై పూర్తిగా వరదనీరు తొలగిపోవడంతో, అంతర్ రాష్ట్ర రవాణా వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తూ, శుక్రవారం ఉదయం నుండి రాకపోకలు రధ్ధీగా సాగిస్తున్నాయి. చత్తీస్గడ్ ఇతర ప్రాంతాల నుండి అత్యవసర సమయాల్లో వైద్యశాలలకు, ఆసుపత్రులకు వెళ్ళు పేషెంట్లు వాహనాల రాకపోకలు వరదల కారణంగా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందు పడ్డారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :