contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Narsapur: అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి

మెదక్ జిల్లా, నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో, అనారోగ్యంతో బాధపడుతున్న పౌరులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించారు. హత్నూర మండలం బోర్పట్ల గ్రామానికి చెందిన నాగరాణి కి NIMS ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల ఎల్. ఓ.సీ ని అందించారు.

ఇక, నర్సాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన సువర్ణ కి కూడా ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల ఎల్. ఓ.సీ ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రదానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి మరియు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి అయిన ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అనేక ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :