contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అమరావతి R5 జోన్‌ రగడలో కొత్త వివాదం.. హద్దురాళ్లు తొలగించిన స్థానికులు..

హైకోర్టు ఆదేశాల తర్వాత అమరావతిలోని R5 జోన్‌లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే పనులు వేగవంతం చేసింది ప్రభుత్వం.. మొత్తం 11వందల 34 ఎకరాలను ఈ జోన్‌ కోసం కేటాయించారు. వీటిల్లోనే పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తారు. ఒకవైపు లేఅవుట్‌ పనులు శరవేగంగా జరుగుతుంటే.. ఇంకోవైపు స్థానికుల నుంచి నిరసనలు తప్పడం లేదు.

మంగళగిరి మండలం కురగల్లులో R5 జోన్‌ హద్దురాళ్లను స్థానికులు తొలగించారు. నిన్న కురగల్లుతోపాటు.. నవులూరు, యర్రబాలెం, నిడమర్రు, కృష్ణాయపాలెంలో అధికారులు పర్యటించి.. అక్కడ భూమిని చదును చేశారు. హద్దురాళ్లు పాతారు. త్వరలోనే CRDA పరిధిలో కేటాయించిన ఈ భూముల్లో గుంటూరు, విజయవాడ పరిధిలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచన. అయితే కురగల్లులో హద్దురాళ్లు తొలగించడంతో కలకలం రేగుతోంది..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :