నెల్లూరు జిల్లా : మర్రిపాడు మండల పరిధిలోని ఇర్లపాడు గ్రామంలో ని అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన అనగా ఆదివారం సాయంత్రం 6 గంటలనుండి అయ్యప్ప స్వామి 2వ సామూహిక మహా పడిపూజకు నిర్వహించడం జరుగుతుందని.. ఈ మహోన్నతమైన పడిపూజా కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వాములు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొనవలసినదిగా ఇర్లపాడు గ్రామ అయ్యప్ప స్వాములు ఆహ్వానము పలికారు.