contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అధ్వానంగా రోడ్లు.. ప్రజల అవస్థలు

తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం  మొగరాలలో రోడ్డు గుంతలు గుంతలు గా మారి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికి జలమయమైన దామలచెరువు – రమణయ్యగారి పల్లి రోడ్డు మార్గం. గత కొంతకాలంగా దామలచెరువు – రమణయ్యగారిపల్లి రోడ్డు మార్గం అధ్వానంగా ఉంది. రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతూన్నప్పటికీ పట్టించుకునే దిక్కు లేదు. భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి ఆదమరిస్తే వాహనంతో పాటు ప్రాణాలకు కూడా ప్రమాదమే. ఇకనైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :