contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాకాలలో టిడిపి నాయకుడి దౌర్జన్యం .. వృద్ధుడిని చితకబాదిన ఘటన

  • సీనియర్ సిటిజన్ ను చితకబాదిన టిడిపి టౌన్ ప్రెసిడెంట్ మోహన్ నాయుడు

 

తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల: స్థానిక కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న చిన్న చిల్లర షాపు నిర్వహిస్తున్న 70 సంవత్సరాల మునిరత్నం నాయుడును టిడిపి పార్టీకి చెందిన కమతం పల్లి మోహన్ చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

వివరాల ప్రకారం, మునిరత్నం నాయుడు తన షాప్ పక్కన కారును నిలిపిన మోహన్‌ను కారు పక్కకు పెట్టమని కోరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాదావాదాలు జరిగినాయి. మోహన్ అక్కడి నుంచి వెళ్లి తన అనుచరులతో తిరిగి వచ్చిన తరువాత, షాపులోని సామాన్లను బాహ్యంగా విసిరి మునిరత్నం నాయుడును కొట్టారని తెలుస్తోంది.

ఈ ఘటనలో మునిరత్నం నాయుడు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు పరస్పరం కంప్లైంట్ చేసుకున్నారు. పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునిరత్నం నాయుడు వంటి వృద్ధుడిని చితకబాదడం అన్యాయమని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ సంబంధిత అధికారులు ఈ అంశంపై సత్వరంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :