contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అభివృద్ధి పై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఫోకస్

సంగారెడ్డి / పఠాన్ చేరు :  జిహెచ్ఎంసి పరిధిలోని డివిజన్లను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్, శిశు మందిర్ కాలనీలలో 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు డివిజన్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. నూతన కాలనీలలో రహదారులు, అంతర్గత డ్రైనేజీల నిర్మాణ పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, అఫ్జల్, వెంకటేష్, అజ్మత్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :