contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించండి .. మంత్రి కోమటిరెడ్డిని కోరిన .. ఎమ్మెల్యే జిఎంఆర్

మరమ్మత్తు పనులకు నిధులు కేటాయించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఆదివారం బంజారాహిల్స్ లోని మంత్రి నివాసంలో కలిసి, వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పలు రోడ్ల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు ఉండటంతో పాటు ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటంతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. దీంతో వివిధ కాలనీల ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ చదివే విద్యార్ధులు నిత్యం ప్రమాదాలబారిన పడుతున్నారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ప్రధానంగా….
1) పటాన్ చెరు నుంచి శంకర్ పల్లి వరకు ఉన్న డబుల్ లైన్ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించాలని.. ఇందుకోసం 70 కోట్ల రూపాయలు కేటాయించాలని..
2) కిష్టారెడ్డిపేట నుంచి దౌల్తాబాద్ వయా రామేశ్వరబండ రోడ్డును సింగిల్ లైన్ నుంచి డబుల్ లైన్లుగా విస్తరించేందుకు 5 కోట్ల రూపాయలు కేటాయించాలని.
3) పటాన్ చెరు నుంచి మల్కాపూర్ రోడ్డు రిపేర్లకు 5.25 కోట్ల రూపాయలు కేటాయించాలని..
4) బీహెచ్ఈఎల్ మొయిన్ గేటు నుంచి ఎన్.హెచ్-9 వయా వెలిమెల రోడ్డు రిపేర్లకు 2.1 కోట్ల రూపాయలను కేటాయించాలని.
5) గుమ్మడిదల నుంచి నూతనకల్ వయా కనుకుంట రోడ్డు విస్తరణకు 6.82 కోట్ల రూపాయలను కేటాయించాలని
6) శివనగర్ నుంచి కంజెర్ల రోడ్డు విస్తరణకు 2 కోట్ల రూపాయలను మంజూరీ చేయాలని ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరారు.

ఎమ్మెల్యే అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఎమ్మెల్యే ప్రతిపాదనలకు తక్షణం అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.* తెలంగాణ ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులు, విస్తరణ విషయంలో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతుందని మంత్రి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :