contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రాష్ట్ర పౌరసరఫరాల సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ గా తోట సుధీర్

పిఠాపురం : కాకినాడ నియోజకవర్గం సీనియర్ జనసేన నాయకుడు, సేవదృక్పథం, మృదు స్వభావం గల డాక్టర్ తోట మెహర్‌ సుధీర్‌ జనసేనపార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి జనసేనాని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్ సిఫార్సులు మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోట మెహర్‌ సుధీర్‌ ను రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర సివిల్ సప్లై ప్రధాన కార్యాలయం విజయవాడలో రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట మెహర్‌ సుధీర్‌ ఆంద్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తున్న కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు హజరైయ్యారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ తోట మెహర్ సుధీర్ లాంటి నీతి, నిజాయితీ విద్యార్హతలు గల వ్యక్తిని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ గా నియమించడం వల్ల ప్రజలకు సివిల్ సప్లయ్ శాఖ ద్వారా నిత్యావసర వస్తువులు సక్రమంగా అందజేయబడుతుందని, అదేవిధంగా సివిల్ సప్లై ద్వారా కొనుగోలు చేసే ధాన్యం వల్ల రైతులకు, కౌలురైతులకు న్యాయం జరుగుతుందన్నారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల ప్రభుత్వంలో రైతులకు ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాసు వెంట జనసేన నాయకులు నల్లం శ్రీనివాసు (బుల్లేట్ వాసు), దుర్గాడ గ్రామ పంచాయతి వార్డు సభ్యులు వెలుగుల సతీష్, మొగిలి శ్రీను, జ్యోతుల సీతరాంబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన నాయకులు మేకల కృష్ణ, సఖినాల లచ్చబాబు తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :