పల్నాడు జిల్లా, వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్సై శ్రీహరి ని సస్పెండ్ చేయాలని టీడీపీ మాచర్ల ఇంచార్జి బ్రహ్మారెడ్డి, మృతుడు దుర్గారావు కుటుంబ సభ్యలతో ధర్నాకు దిగారు. వెల్దుర్తి ఎస్సై శ్రీహరి వేధింపులు తాళ్ల లేక టీడీపీ కార్యకర్త దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నాడని, ఎస్సై ని సస్పెండ్ చేయాలని డిమాండ్ డిమాండ్ చేశారు.
వివరాల్లోకి వెళితే ..పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బంగారు పెంట తండ కు చెందిన దుర్గారావు, పోలీసుల వేధింపులు తాళ్లలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై పెట్టిన తప్పుడు కేసులో కండిషన్ బెయిల్ పై ఉన్న దుర్గారావు, వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాల్సి ఉంది. పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఎస్సై శ్రీహరి కొట్టి చంపేస్తాడనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పార్టీ మారాలని టిడిపిని వదిలి వైసిపి పార్టీలో చేరాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఎస్ఐ ప్రతి రోజు దుర్గారావు ను పార్టీ మారకుంటే చంపేస్తానని, ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించి తప్పుడు కేసులు పెట్టి కొడుతున్నాడని బాధతో ఆత్మహత్య చేసున్నాడని సమాచారం. దుర్గారావు పై అక్రమంగా మద్యం కేసుపెట్టి వేధింపులకు గురి చేసి ఆత్మహత్యకు పురిగొల్పిన ఎస్సై ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు.