అల్లూరి జిల్లా, జికె వీధి,ది రిపోర్టర్ న్యూస్: ఆదివాసీ మేధావుల ఐక్యవేదిక హక్కుల సాధన కమిటీలో రాష్ట్ర కార్యదర్శిగా బోండ్ల చిరంజీవిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ మేధావుల ఐక్య వేదిక వ్యవస్థాపకులు హైకోర్టు న్యాయవాది అనుముల వంశీకృష్ణ అల్లూరి జిల్లా, జి కె వీధి మండలం, కె. కొదిసింగి గ్రామానికి చెందిన బోండ్ల చిరంజీవిని రాష్ట్ర కార్యదర్శి గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు, ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ…. అదివాసిలమేధావుల ఐక్య వేదికలో రాష్ట్ర కార్యదర్శి గా స్థానం కలగడం నాకు నా జాతిపట్ల బాధ్యతను పెంచిందని భావిస్తు న్నానన్నారు,ఆదివాసీ సమాజానికి ఎదురైతున్న సమస్యల పట్ల రాజకీయాలకు అతీతంగా ఉద్యమ స్ఫూర్తి దాతలతో అందరితోకలిసి పనిచేయడానికి కార్య సాదకున్ని అవుతానని నితి అనే బరువు, బాధ్యతగా మోయగలిగిననాడు జాతి అనే సమూహానికి అపద రాకుండా అడ్డుకుని కాపాడు కోగల్గుతామని అందుకు నా మీద నమ్మకంతో అప్పగించిన కర్తవ్య నిర్వహణను అదివాసిల హక్కుల సాధనలో అందరితో కలిసి పోరాడుతానని తెలియ జేసుకుంటు ఆదివాసీ మేధావుల ఐక్య వేదిక వ్యవస్థాపకులు అనుముల వంశీకృష్ణకు ఇంటలేక్చువల్ పోరం మేదావులకు అందరికీ కృతజ్ఞతలు తెలియ జేశారు.