ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో విద్యార్థినులపై విష ప్రయోగం కలకలం రేపింది. సర్-ఎ-పుల్ ప్రావిన్సులోని సంగ్బారక్ జిల్లాలో ఉన్న 2 సూళ్లపై విష ప్రయోగం జరిగింది. ఇందులో దాదాపు 80 మంది బాలికలు ఆస్పత్రి పాలయ్యారు. దీనికి ఎవరు పాల్పడ్డారనేది తెలియాల్సి ఉంది. బాలికల విద్యపై ఆంక్షలు విధించిన తాలిబాన్లు ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
