contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పోలీస్ ఆకస్మిక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

  • ఈ నెల 28 నుంచి ఆగస్టు 03 వరకు మావోయిస్టు సంస్మరణ వారోత్సవాల సందర్బంగా రామగుండం పోలీస్ కమిషనరేట్..

మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లం పల్లి గ్రామంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జైపూర్ ఏసిపి మోహన్ గారి ఆధ్వర్యంలో చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్ , ఎస్ఐ లు పోలీస్ సిబ్బంది మొత్తం 35 మందితో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించి ఇళ్లను సోదాలు చేశారు. వాహన పత్రాలు సరిగా లేని 18 బైక్ లు,02 ఆటోలను సిజ్ చేయడం జరిగింది. యువకులు సంఘ విద్రోహ శక్తులకు సహకరించవద్దని చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్ అన్నారు. మావోయిస్టు సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కమ్యూనిటీ కాంట్రాక్టు కార్యక్రమంలో భాగంగా కల్లం పల్లి గ్రామం లో గ్రామస్థులతో సమావేశమయ్యారు.

సీఐ మాట్లాడుతూ…. మావోయిస్టు సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే పోలీసులు ధ్యేయమన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100 కు సమాచారం అందించాలన్నారు. మావోయిస్టుల ప్రలోభాలకు లొంగకుండా గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రజలు అసాంఘిక శక్తులకు. సహకరించవద్దన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండా లని, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం, ఓటీపీ వివరా లను చెప్పవద్దన్నారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వారు వస్తే ఆశ్రయం ఇవ్వద్దన్నారు. మావోయిస్టుల ప్రలోభాలకు ఆకర్షితులు కావద్దన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, ధృవీకరణ పత్రాలను కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నీల్వాయి ఎస్ఐ సుబ్బారావు, కోటపల్లి ఎస్ఐ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :