తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల రైల్వే స్టేషన్’లో 13 కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సిఐ సుదర్శన్ ప్రసాద్ మీడియాతో సమావేశం నిర్వహించారు. సి.ఐ మాట్లాడుతూ నెల్లూరుకు చెందిన విష్ణు మోహన్ రెడ్డి, తమిళనాడుకు చెందిన పాండియన్లు ఇద్దరు కలిసి విజయవాడ నుంచి మదురైకి గంజాయి తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బంది సబ్ ఇన్స్పెక్టర్ ఎం.యన్. సంజీవ రాయుడు, పోలీస్ సిబ్బందితో కలిసి పాకాల రైల్వే సషన్లో అరెస్ట్ చేశామని చెప్పారు. వారి వద్ద నుంచి 13 కేజీల గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వారిని రిమాండు నిమిత్తము పాకాల కోర్టుకు పంపడమైనదన్నారు.