- 2 లక్ష 84 వేల 29 రూపాయల అక్రమాలు
- 3 ఏళ్లల్లో 8 కోట్ల పనులు
కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: గత మూడేళ్ల కాలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై సోమవారం గన్నేరువరం మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆవరణలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, డి ఆర్ డి ఓ పిడి శ్రీలత ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. గత మూడేళ్ల కాలంలో మండలంలో 8 కోట్ల 16 లక్షల 90 వేల 643 ల పనులను కూలీలతో మెటీరియల్తో చేపట్టారు. ఈ పనులపై సామాజిక తనిఖీ బృందం సభ్యులు గత నెల 28వ తేదీ నుంచి ఈనెల ఎనిమిదో తేదీ వరకు గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాపూర్,గునుకుల కొండాపూర్, జంగపల్లి గన్నేరువరం లో పనులు చేసిన కూలీలకు డబ్బులు అందలేదని గుర్తించారు. పనుల వివరాలను సక్రమంగా రికార్డులు లేవని వెలుగులోకి వచ్చాయి. హరితహారం లో నాటిన మొక్కలకు ప్రస్తుతం ఉన్న మొక్కలకు చాలా వ్యత్యాసాన్ని గుర్తించారు. గునుకుల కొండాపూర్ లో ఒక కూలికి పనులు చేయకుండా 1542లు చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు. గుండ్లపల్లి లో మాస్టర్ రికార్డు లేకుండా పనులు చేపట్టారని 9మంది కూలీలకు సంతకాలు లేకుండా కూలీ చెల్లింపులు జరిగినట్లు వెల్లడి అయింది. కాకపోతే నివేదిక అనంతరం అక్రమాలు చోటుచేసుకున్న గ్రామపంచాయతీలోని సంబంధిత సిబ్బందికి నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, అడిషనల్ డిఆర్డిఏ సంధ్యారాణి, ఎంపీడీవో స్వాతి, ఎస్ఆర్పి రాఘవులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సిబ్బంది కార్యదర్శులు సామాజిక తనిఖీ బృందం సభ్యులు పాల్గొన్నారు.