contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఉచిత ఇసుకను అందుబాటులోకి తెస్తాం : ప్రకాశం కలెక్టర్

ప్రకాశం జిల్లా: జిల్లాలో ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టామని, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ఇసుక సరఫరా ప్రణాళికపై బుధవారం ఒంగోలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యం ప్రజలకు పారదర్శకంగా ఉచిత ఇసుక అందించడమేనని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం జులై 8 నుండి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీను తీసుకొని రావడం జరిగిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో జులై 8 వ తేదీ నుండి 62, 291 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచిత ఇసుక పాలసీ కింద ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ రోజు కు మన జిల్లలో ఇసుక స్టాక్ పాయింట్స్ లేవని, జిల్లాకు అవసరమైన ఇసుకను నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లోని ఇసుక స్టాక్ పాయింట్స్ నుండి సరఫరా జరుగుచున్నదని కలెక్టర్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో స్థానిక అవసరాల కోసం మొత్తం 285 వాగులు మరియు వంకలను గుర్తించడం జరిగిందన్నారు. గుర్తించిన వాగులు, వంకల నుండి సమీపంలోని గ్రామాల ప్రజలు తమ సొంత గృహ నిర్మాణాల అవసరాలకు వాడుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా చట్టబద్ధమైన అనుమతులు పొంది పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు సంబంధిత వ్యక్తులు దరకాస్తు జిల్లా స్థాయి సాండ్ కమిటీకి చేసుకుంటే పరిశీలించి అనుమతి ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. రానున్న రోజుల్లో అనుమతి ఇచ్చిన పట్టా భూముల ఇసుక రీచ్ ల నుండి ఇసుక రవాణా చేసుకోవచ్చునన్నారు. ఏపి శాండ్‌ పోర్టల్‌లో ఇసుక బుక్‌ చేసుకున్న వారు సొంత వాహనం ద్వారా ఇసుక తీసుకెళ్లవచ్చని లేదంటే పోర్టల్‌లోనే ట్రాన్స్‌పోర్టు సౌకర్యం కూడా ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఈ నెల అక్టోబర్ నుండి 2025 మార్చి వరకు జిల్లాలో 4.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమని అంచనా వేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు దగ్గరలోని నెల్లూరు జిల్లాలోని కరేడు మరియు దప్పలంపాడు రెండు డిసిల్టేషన్ పాయింట్స్ నుండి 2,26,108 మెట్రిక్ టన్నుల ఇసుక అక్టోబర్ 15 తేదీ నుండి జిల్లాకు అందుబాటులోకి రానున్నదని కలెక్టర్ వివరించారు. అదే విధంగా కడప జిల్లాలో అక్టోబర్ 15 నుండి 10 ఇసుక ఓపెన్ రీచ్ లు ప్రారంభం కానున్న నేపద్యంలో కడప జిల్లా నుండి కుడా 693750 మెట్రిక్ టన్నుల ఇసుక జిల్లా ప్రజల అవసరాలకు అందుబాటు లోకి రానున్నట్లు కలెక్టర్ వివరించారు. గత నెల సెప్టెంబర్ నెల 20 తేదీ నుండి ఇసుక కావాల్సిన ప్రజలు https://sand.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడం జరుగుచున్నదన్నారు. ఇప్పటివరకు 10, 287 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం 519 ఆర్డర్స్ బుక్ అయినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణా, బ్లాక్ మార్కెటింగ్ చేసేవారిపై చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ఇప్పటి వరకు 32 కేసులు బుక్ చేసి 8.78 లక్షల రూపాయలు పెనాల్టీ విధించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఇసుక కార్యకలాపాలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు వినియోగదారుల కోసం 6281799518 ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పిర్యాదులపై వెంటనే పరిష్కారం చూపడం జరుగుచున్నదని కలెక్టర్ వివరించారు. ఇసుకను జిల్లాలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్‌ వివరించారు. ప్రజలు ఎవరూ కూడా ఇసుక కోసం దళారులను ఆశ్రయించవద్దని, ప్రజలందరూ ఏపి శాండ్‌ పోర్టల్‌ ద్వారా మాత్రమే ఇసుకను బుక్‌ చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇసుక రీచ్ లలో వున్న ఇసుక అందరికి అందుబాటులో వుంచాలన్న లక్ష్యంతో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న వారిపై మరియు ఇసుకను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా వుంచడం జరుగు చున్నదన్నారు. ఇప్పటి వరకు 70 కేసులను నమోదు చేయటం, వాహనాలను సీజ్ చేయటం జరిగిందన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక పాలసీని పటిష్టంగా అమలు జరిగేలా క్షేత్ర స్థాయిలో ప్రత్యేక టీం లను కూడా ఏర్పాటు చేసి పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని ఎస్పీ వివరించారు. ఉచిత ఇసుక పాలసీ విధానం అందుబాటులోకి వచ్చిన దృష్ట్యా ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే సంబంధిత వాహనాలను సీజ్ చేయడం, అరెస్ట్ చేయడం, మరలా మరలా పట్టుబడితే వారిపై పిడి యాక్ట్ పెట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలియచేసారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :